విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపూలే బిసి హాస్టల్ ముగ్గురు విద్యార్ధులకు కట్లపాము కాటువేయడం దురదృష్ట ఘటన అని డిప్యూటీ సి. ఎం. పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఘటన వార్త విన్నవెంటనే అమె విజయనగరం ప్రయివేటు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. రంజిత్ అనే విద్యార్ధి మార్గ మధ్యంలోనే చనిపోయారని, ఒకరు వెంటిలేటర్ పై, ఒకరు ఐ. సి. యు లో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అర్ధరాత్రి హాస్టల్ లో పాము కాటుకు గురైన వారికి కురుపాం ఏరియా ఆస్పత్రి లో సక్రమమైన ప్రాధమిక చికిత్స అందించామన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, ఇటువంటి ఘటనలు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార్లకు ఆదేశించారు.