ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కురుపాంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో ఊహించని ప్రమాదం ఎదురైంది. గురువారం రాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులపై పాము దాడి చేసింది. 8వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులను విషపూరిత పాము కాటేసింది. దీంతో బాధిత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హాస్టల్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం బాధిత విద్యార్థులను విశాఖ కేజీహెచ్కు హుటాహుటిన తీసుకెళ్లారు. అయితే అనే ఓ విద్యార్థి మృతి చెందాడని తెలుస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారులు పాము కాటుకు గురవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.