అమరావతి రైతుల అకుంటిత దీక్ష ఫలితమే హైకోర్టు తీర్పు అని టీడీపీ నాయకుల పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పుపట్ల తెలుగుదేశం నాయకులు హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రుల కలలు, రైతుల సుదీర్ఘ ఉద్యమం ఫలంగానే అమరావతినే రాజధానిగా ఉండాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రతోపాటు 802 రోజులు అకుంటిత దీక్ష ఫలించిందన్నారు. అంబేద్కర్ సర్కిల్లో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అంశాల్లో హైకోర్టు మొటిక్కాయలు వేసినా బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం అమరావతి రైతుల పట్ల ఎంత అమానుషంగా ప్రయత్నించినా ఉద్యమాన్ని అణిచివేసేందుకు నిందలు వేసినా రైతులు భరించారన్నారు.
ఈ కార్యక్రమ మంలో టీడీపీ నాయకులు రామాంజినమ్మ, షఫీవుల్లా, నాగరాజు, రమేష్, నారాయణరెడ్డి, సతీష్, రాఘవేంద్ర, నాగేంద్ర, అమర్నాథ్, హెచ్ఎన్ రాము, దాదాపీర్, వెంకటరమణ, అశ్వర్ధప్ప, భార్గవ్, మంజునాధ్, నాగార్జున, నాగభూషణం, రవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.