బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. చెన్నైకు 840 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతూ వస్తోంది. తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి 70 కి.మీ. వేగంతో శుక్ర, శనివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. వాయుగుండం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులెవరూ ఈ నెల 6వ తేదీ వరకు వేటకు వెళ్లొద్దని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. సాధారణంగా మార్చి నెలలో వాయుగుండాలు ఏర్పడడం అరుదుగా సంభవిస్తుంది. గత 200ల సంవత్సరాలలో కేవలం 11 సార్లు మాత్రే ఇలా జరిగింది.