విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక నష్టాలతో ఫర్నిచర్ దుకాణ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వెబ్ సైట్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరంలోని డక్కిని వీధికి చెందిన వీఎస్ రావు వైష్ణవి వీధిలో ఫర్నిచర్ దుకాణం నడుపుతున్నాడు. గత కొన్నాళ్లుగా వ్యాపారం సక్రమంగా నడవక అప్పులు చేసి అద్దె కట్టడం కష్టంగా మారింది. దీంతో తట్టుకోలేక ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.