విజయనగరం: కురుపాం మండలం లో గల గిరిజన గ్రామాల్లో నాటుసార విక్రయాలు పై దృష్టి సారించినట్టు ఎస్సై శివ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు నాటుసారా కేంద్రాలపై దాడులు చేసి వందల లీటర్లు బెల్లపుఊట ధ్వంసం చేసామన్నారు. ఎవరైనా నాటుసారా తరలించిన, విక్రయించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నాటుసారా తో దొరికిన వ్యక్తులకు సంక్షేమ పధకాలు నిలుపుదల చేయాలని ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. నాటుసారా తయారిపై ఎవరివద్ద సమాచారం ఉన్న తెలపాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు.