వైకాపా పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నాయకుల చరిత్ర చూడకుండా ఓటేస్తే ఇలాంటి దుస్థితే వస్తుందని అన్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజల సొమ్మును జగన్ కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. బడుగులకు మంచి చేస్తున్నట్లు నటిస్తున్న ముఖ్యమంత్రి...ఆ పార్టీ నేతలకు మాత్రం దోచి పెడుతున్నారని ఆరోపించారు.