మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి వారిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ మరియు అర్చకులు మంత్రి సురేష్ ను ఆహ్వానించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వసతులు, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైసిపి నాయకులు ఉన్నారు.