నెల్లూరు: సూళ్లూరుపేట మున్సిపల్ సమావేశంలో పలు అభివృద్ది పనులకు ఆమోదం తెలిపారు. 14 అంశాలతో కూడినటువంటి అజెండాతో జరిగిన సాధారణ సమావేశం సమావేశం ప్రారంభం కాగానే మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నిమిషాలు మౌనం పాటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ చేపట్టాలన్న అజెండా మినహా మిగిలిన అన్ని అంశాలను తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.