ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉడ్ కాంప్లెక్స్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 బస్సులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో దాదాపు 20 కి పైగా బస్సులు ఉన్నట్లు సమాచారం. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.