ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు లారీలు డీ. డ్రైవర్ సజీవదహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 10:46 AM

విజయనగరం జిల్లా, కొమరాడ మండలం ఆర్తాం వద్ద అర్హరాత్రి 2 గంటల సమయం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీ ని వెనుక నుంచి ఇంకో లారీ ఢీ కొట్టింది. దాంతో డ్రైవర్ ముందు భాగంలో ఇరుకుపోయాడు. ఢీకొన్న తర్వాత భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో డ్రైవర్ సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లా నంబురు గ్రామానికి కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో లారీ దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com