గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ ( జియో), టాస్ స్వఛ్చంద సంస్థల ఆధ్వర్యంలో శృంగవరపుకోట మండలం తలారి మండల ప్రాధమికోన్నత పాఠశాలలో సోమవారం పలు రకాల మొక్కలు నాటారు. శ్రీనాధు సావిష్ మూడవ వర్థంతి సందర్భంగా స్వప్న, యస్ ఆర్ కె సోదరులు సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జియో వ్యవస్థాపకులు బి. రామకృష్ణ తెలిపారు. కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు భీమవరపు సురేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో టాస్ కార్యదర్శి లక్ష్మి, లక్ష్మణ్ దాస్, ఉపాధ్యాయులు మావూరి ఈశ్వరరావు, సత్యవతి, సుశీల, విద్యార్థులు బొబ్బిలి హ్రృషీకేశ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.