యానాంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు శని వారం ఎన్సీసీ-బి సర్టిఫికెట్ పరీక్షను కారైకాల్ నుంచి వచ్చిన ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎల్కే జోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారు చమురు ఉత్పత్తి సంస్థలు, పలు కార్యాలయాల్లో సెక్యూరిటీ విభాగంలో మంచి జీతంతో పని చేయడానికి అవకాశం వస్తుందన్నారు. కళాశాల ఎన్సీసీ అధికారి కెప్టెన్ జోగిందర్ సింగ్, జూనియర్ కమాండింగ్ ఆఫీసర్ సుశీల్ కుమార్ పాల్గొన్నారు.