ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదాలు అరికట్టేందుకు వేగ నిరోధకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 10:03 AM

తూర్పు గోదావరి: యానాం మీదుగా వెళుతున్న జాతీయ రహదారి - 216పై ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు పరిపాలనాధికారి అమన్ శర్మ తెలిపారు. అమలాపురం - కాకినాడ మార్గంలో ఘటనలపై నేషనల్ హైవే అథారిటీ డైరెక్ట ర్ తో మాట్లాడామన్నారు. రహదారి విస్తరణ గుత్తేదారు, ఇంజినీర్లతో చర్చించి యానాం పరిధిలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. వాహనచోదకులు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు శిరస్త్రాణాలు ధరించాలన్నారు. ప్రజలు ఇళ్లలోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులకే అందించాలని, తద్వారా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com