గుమ్మలక్ష్మీపురం మండలం రెళ్ల గ్రామ సమీపంలో బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి కి తీవ్రగాయాలయ్యాయి. రెళ్ల గ్రామ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ కు గుర్తు తెలియని వాహనం ఢీకొని రెల్లి గూడ గ్రామానికి చెందిన వ్యక్తి తలకి, కాలికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన 108 కి ఫోన్ చేయగా క్షతగాత్రుడును ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్షతగాత్రుని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.