తూర్పుగోదావరి జిల్లాలో రూ.10 లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో… రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం కలిసి రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న నాయుడు లేఔట్ లో ఉన్న గోడౌన్ నందు దాడులు నిర్వహించారు. గోడౌన్ లో నిల్వ ఉంచిన గోవాకు చెందిన 9,200 క్వార్టర్ విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి మద్యాన్ని తెప్పించి నిల్వ చేసిన ప్రధాన ముద్దాయి కూసుమంచి వెంకట రత్న త్రినాథ్ తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.