రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో ఉన్న నకిలీ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాప్తాడు తహశీల్దార్ , ఓటరు నమోదు సహాయ అధికారిణి బి. ఈరమ్మ బీఎల్ఓ లను ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ అధ్యక్షతన బీఎల్ఓ లతో సమావేశం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లను కలిగివున్న వారి ఫోటోలను గుర్తించాలన్నారు.
ఎంపీడీఓ సాల్మన్ రాజు మాట్లాడుతూ గ్రామాల్లో నివాసం ఉన్న ప్రజల ద్వారా ఓటరు జాబితాను పరిశీలించి వివరాలు తీసుకుని రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే ఒకటి తీసేసేలా చర్యలు చేపట్టి నిజమైన ఓటరు ఓటు వేసేలా చొరవ చూపితే పోలింగ్ పారదర్శకతగా జరిగేలా చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మౌనిక, సునీత, వీఆర్వోలు బిఎల్ఓ లు పాల్గొన్నారు.