తూర్పు గోదావరి: దొంగనోట్ల కలిగి ఉన్నట్లు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు, అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఉత్తర్వుల మేరకు, అడిషనల్ ఎస్పీ కె. లతా మాధురి పర్యవేక్షణలో బొమ్మూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, హుక్కంపేట గ్రామ పరిదిలోని, వీర్రాజు వీధిలోని ఎస్. పి రాజు పార్క్ వ్యూ అపార్ట్మెంట్లోని 3 వ అంతస్తులో ప్లాట్ నెంబరు-302లో ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద 16 లక్షలు విలువ గల దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై దొంగ నోట్లు చెలామణి క్రింద కేసు నమోదు చేశారు. ముగ్గురు ముద్దాయిలను కోర్టుకులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించడమైనది. ఈ కేసులో విశిష్ట కృషి చేసి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శివాజీ, సిబ్బందిని అర్బన్ జిల్లా ఎస్పీ అభినందించారు.