ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వం వివిధ విభాగాల్లో బహుళజాతి సంస్థల్లో కొలువులు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. 2016-21, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన బి.టెక్, ఎం.టెక్.. ఎంసీఏ ఉత్తీర్ణులకు అవకాశం కలగనుంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయనగరం గాజులరేగలో ఉన్న సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఉద్యోగ మేళా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 200 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అభ్యర్థులు ముందుగా http://lapasdc.in industryplacements నమోదు చేసుకోవాలి.