నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయగిరి లోని మెరిట్స్ కళాశాలలో దివంగత నేత గౌతమ్ రెడ్డి కి కడసారి వీడ్కోలు పలికారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు నుంచి ర్యాలీగా వాహనాల్లో ఉదయగిరి మెరిట్స్ కళాశాలకు తీసుకువచ్చారు.
అంతకుముందే అక్కడకు చేరుకున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలికారు. అనంతరం గౌతమ్రెడ్డి పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి కడసారి వీడ్కోలు పలికారు అనంతరం అంత్యక్రియలు ముగిసాయి. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. వారితో పాటు జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చేజర్ల సుబ్బారెడ్డి తదితరులు ఎంత క్రియల్లో పాల్గొన్నారు.