తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణం శివారు పెద్ద రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి ( 35) మృతిచెందాడని ఎస్ఐ అబ్దుల్ మారుఫ్ మంగళవారం తెలిపారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రిలో మార్చిలో భద్ర పరిచాము అన్నారు. మృతుని వివరాలు తెలిసిన ఎడల తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లు సంప్రదించవలెను అని ఎస్ఐ తెలిపారు.