పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరుకు చెందిన వాకాటి ప్రవీణ్ కుమార్ కొమురిక గ్రామంలోని అత్తారింట్లో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువజామున మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.