మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహం అంతిమయాత్ర బుచ్చిరెడ్డిపాలెం కు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో జొన్నవాడ మీద భారీ కాన్వాయ్ తో భౌతికకాయానికి అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. దారిపొడుగునా కార్యకర్తలు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. అంతిమయాత్రో జిల్లా అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొని అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు ఉదయగిరి వైపు తరలి వెళ్తున్నారు.