నెల్లూరులోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం నుంచి ఆయన అంతిమ యాత్ర బుధవారం ఉదయం 6. 15 గంటలకు ఉదయగిరి కి బయలుదేరింది. అంతిమయాత్ర కాన్వాయ్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, , రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితర ప్రముఖులు అంతిమయాత్ర తో పాటు బయలుదేరారు.