ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గౌతమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన వెంకటగిరి వైసీపీ శ్రేణులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 01:51 PM

ఏపీ పరిశ్రమలు, ఐ. టి. మంత్రిత్వశాఖా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్కు అత్యంత సన్నిహితులు మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ లోని అపోలో హిస్పిటల్లో గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయిన విషయం తెలిసిందే.


ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరిలో వైసీపీ నాయకులు చిట్టెటి హరికృష్ణ, ఎల్. కె ఆర్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద టెంట్ వేసి మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి, వెంకటగిరి వైసీపీ శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్బంగా చిట్టెటి, ఎల్. కె. ఆర్ లు మాట్లాడుతూ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం అటు రాష్ట్రానికి ఇటు పార్టీ కి, జిల్లాకి తీరని లోటని అన్నారు. ఇటీవల దుబాయ్కి వెళ్లి ఎక్స్పో లో పాల్గొని రాష్ట్రానికి 5 వేల 15 కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని తిరుగు ప్రయాణంలో నిన్న హైదరాబాద్కు రావడం సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐ. టి. శాఖల పరంగా ఆయన రాష్ట్రానికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.


ఈ కార్యక్రమం లో చిట్టెటి హరికృష్ణ, ఎల్. కె. ఆర్ తోపాటు వైసీపీ సీనియర్ నాయకులు మంగళపురి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య, జడ్పీటిసి కోలా వెంకటేశ్వర్లు, ఏఎంసి వైస్ చైర్మన్ మల్లి రెడ్డి, కౌన్సిలర్ నారిశేఖర్, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ దేవస్థాన పాలకమండలి సభ్యులు ఆవుల మోహన్ యాదవ్, వైసీపీ నాయకులు పూజారి శ్రీనివాసులు, సతీష్, గణేష్, అబూబకర్, సుబ్రమణ్యం, చంద్రశేఖర్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com