ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 01:27 PM

తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలో మానవత్వం మసకబారింది. గత ఐదు రోజుల నుండి మండల గ్రామమైన జగపతినగరం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా ప్రధాన ఆర్. అండ్. బి రహదారి చెంతన అచేతనంగా ఒక వృద్ధుడు అహకారాలు చేస్తూ పడి ఉన్నప్పటికీ గ్రామస్తులు ఎవరికి ఆ సన్నివేశం కనిపించకపోవడం చాలా దురదృష్టకరం. ఐదు రోజుల నుండి అన్నపానీయాలు లేకుండా రహదారి చెంతనే బిక్కుబిక్కుమంటూ దోమలు పురుగులు చేసిన గాట్లకు ఆ వృద్ధుడు మూలుగుతూ కనబడుతున్నప్పటికీ ఆ దారిన వెళ్లేవారు చూస్తూ పోతున్నారే తప్ప కనీసం ఆ అభాగ్యుడు పట్ల కనికరం కూడా చూపకపోవడం ప్రస్తుత తరుణంలో మానవత్వం ఏవిధంగా తయారయ్యిందో తేటతెల్లం కానుంది. ఇప్పటికైనా ఈ చలి కాలంలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధునికి ఎవరైనా సహాయం చేయాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com