రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల మంగళవారం మామిడికుదురులో వైసిపి శ్రేణులు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రంలో పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప యువ నేతను కోల్పోయాం. ఆయన లేని లోటు పార్టీకి తీరనిది అన్నారు. అలాగే గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు