గుండెపోటుతో హఠాన్మారణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహం నెల్లూరుకు చేరుకుంది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేవీ హెలీకాఫ్టర్లో మంత్రి పార్థివ దేహాన్ని నెల్లూరుకు తీసుకెళ్లారు. స్థానిక పరేడ మైదానంలోని హెలీప్యాడ్ నుంచి గౌతమ్ రెడ్డి స్వగృహానికి తరలించారు. సహచర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తమ అభిమాన నేతను చివరి చూపు చూసేందుకు వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అభిమానులు సందర్శనార్థం నేతలు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయగిరి మెరిట్ ఇంజినీరింగ్ కాలేజీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. మంత్రి మృతితో ఇప్పటికే రెండు రోజులు సంతాప దినాలను ఏపీ సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ కీలక కార్యక్రమాలను కూడా వాయిదా వేస్తూ, నిర్ణయం తీసుకున్నారు.