స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని రాజమండ్రి సబ్ కలెక్టర్ ఇలాక్కియా అన్నారు. సోమవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ అధికారులతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 20 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి జె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.