లక్షల్లో జీతమన్నాడు.. దర్జాగా బత కొచ్చని నమ్మించాడు.. తీరా పెళ్లయ్యాక నట్టేటా ముంచి.. ఇంటి దగ్గర వదిలేశాడో భర్త. విజయనగరానికి చెందిన ఓ యువతికి కృష్ణా జిల్లాకు చెందిన నిశాంత్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. తాను ఆస్ట్రేలి యాలో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నానని,రూ. లక్షల్లో జీతం వస్తోందని చెప్పాడు.
దీంతో నమ్మేసిన బాధిత తల్లిదండ్రులు రూ.50 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలతో అతనికి కట్టబెట్టారు. గతేడాది ఆస్ట్రేలియాలో వివాహమైంది. పెళ్లికూతురు తల్లిదండ్రులు, బంధువు లంతా వర్చువల్ విధానంలో వివాహానికి హాజరయ్యారు. కొన్నిరోజులయ్యాక, నిందితుడు ఓచిన్నపాటి కంపెనీలో తక్కువ జీతంతో పనిచేస్తున్నట్లు తెలుసుకుని అవాక్కయ్యారు.
ఇంతలో పరిస్థితిని గమనించిన నిశాంత్ అదనపు కట్నంకోసం వేధిస్తూ ఇటీవల పుట్టింటి వద్ద వదిలేశాడు. ఫోన్చేసి రూ. 25 లక్షలు తీసుకురమ్మంటున్నాడని, లేకుంటే వదిలేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆదివారం దిశ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.