మంగళవారం గుండె పోటుతో హైదరాబాద్ లో మరణించిన ఏపీ ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి మతి పట్ల నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సంతాపం తెలిపి ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.నివాళులర్పించిన వారిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. గౌతంరెడ్డి మృతిపట్ల ఏపీ ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఎల్లుండి నెల్లూరు జిల్లా బ్రహ్మణ పల్లిలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.