సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి.మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల క్రితం నేవీ అమ్ముల పొదిలో చేరింది ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నం. శత్రువులపై విరుచుకుపడే అతిపెద్ద డిస్ట్రాయర్ నౌకగా ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నంకు గుర్తింపు వుంది.
గతంలో కూడా విశాఖ కేంద్రంగా.. ఫ్లీట్ రివ్యూ.. జరిగింది. PFR భారత నావికాదళం సంసిద్ధత, అధిక ధైర్యాన్ని, క్రమశిక్షణకు దేశానికి భరోసా ఇవ్వడానికి ఉద్దేశించింది. 2006లో మెుదటిసారి ఫ్లీట్ రివ్యూ జరగ్గా.. ప్రెసిడెంట్.. ఏపీజే అబ్దుల్ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. ఆ తర్వాత 2016లోనూ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు.
అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చారు. ప్రణబ్ విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలవబడే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను పరిశీలించారు. త్రివిధ దళాల అధిపతిగా భారత నావికాదళ సామర్ధ్యాన్ని రాష్ట్రపతి రేపు సమీక్షించనున్నారు. ప్రతి రాష్ట్రపతి తన పదవీ కాలంలో నావికాదళ సామర్ధ్యాన్ని సమీక్షించడం ఆనవాయితీ. 12వ ఫ్లీట్ రివ్యూను ఈసారి తూర్పు తీర నావికాదళం నిర్వహిస్తోంది. ఈ రివ్యూకి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్సింగ్, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. విశాఖపట్నం PFRను నిర్వహించడం ఇది రెండోసారి.