ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశ్రీ అరసవెల్లి ఆలయాన్ని దర్శించుకున్న వైసీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 11:37 AM

విజయనగరం జిల్లా విజయనగరం వైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి కే వి సూర్యనారాయణ రాజు ఆదివారం శ్రీకాకుళం లో ఉన్న శ్రీ శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇతనితో పాటు జిల్లా వైయస్సార్ పార్టీ యువజన నేత హర్ష వర్ధన్ రాజు కుటుంబ సభ్యులు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో మంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. కుటుంబ సమేతంగా గా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బయటికి వస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్రంలో క్షేమ పథకాలతోపాటు ప్రజల ఆరోగ్యం ఐశ్వర్యం చాలా అవసరం అన్నారు. అందరి ఆరోగ్యం బాగుండాలని అందరూఅభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com