ట్రెండింగ్
Epaper    English    தமிழ்

61 మందికి షోకాజ్ నోటీసులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 11:07 AM

నెల్లూరు: బయో మెట్రిక్ హాజరు ఆన్లైన్లో వంద శాతం నమోదు చేయని 61మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు శనివారం రాత్రి తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 16వ రకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని వారిని గుర్తించామన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమోలు జారీ చేసినట్లు వివరించారు. నోటీసు అందిన మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com