టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మురమళ్ళలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ నెల 23న జోన్-5 టీడీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. నాయకులు చెల్లి వివేకానంద, మోకా ఆనంద్ సాగర్, నాగిడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.