తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర లారీ పై దుండగలు కాల్పులు కలకలం అనే అంశంతో ఒక ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ నందు వస్తున్న వార్తలు అవాస్తవమని కాకినాడ డీఎస్పీ భీమరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద ప్రయాణిస్తున్న లారీ దాని వెనుక మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు ఓవర్టేక్ చేయడానికి ఆకాశం ఇవ్వలేదని అసహనానికి గురైన దుండగులు లారీ అద్దంపై దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసినది ఈ సంఘటనలో లారీ డ్రైవర్ కు గాని ఎటువంటి గాయాలు కాలేదన్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలియజేసారు. ఇటువంటి అవాస్తవమైన వార్తలను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు.