తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం యానం ఎదుర్లంక జి.ఎం.సి.బాలయోగి వారధిపై ఆదివారం డిసీఎం బైకు ఢీకొనటంతో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అదే బైక్ పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పిల్లలు హర్షిత, లక్కీ తీవ్ర గాయాలలు కాగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో యానాం ఆసుపత్రికి తరలించారు. మృతులది ఐ.పోలవరం మండలం గుత్తిన దీవి గ్రామం వైదాడి కుమార్(32), భార్య పద్మ(27), కుమారుడు హర్ష(10)గా గుర్తించారు. ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.