కొవిడ్ బాధితులకు లక్షా. పది లక్షలు కాదు, ఏకంగా రూ. 4 కోట్లకు పైగా బకాయిల కోసం క్యాటరింగ్ నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చెప్పిందనేనమ్మకంతోబాధితులకు భోజనం, మంచి నీరు అందిస్తే ఆ బిల్లులు ఏడాది కావస్తున్నా అందని పరిస్థితి నెలకొంది. అప్పోసప్పో చేసి కిరాణదుకాణాలయజమానులకు, వంట మాస్టర్లు, ఇతర క్యాటరింగ్ సిబ్బందికి చెల్లించినప్పటికీ ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో బిల్లులు ఎప్పుడు మహాప్రభో అంటూ ధీనంగా జగన్ సర్కార్ వైపు ఎదురు చూస్తున్నారు. కొవిడ్ మహమ్మారి జిల్లాలో విజృంభించింది. తొలిదశలో ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. కొవిడ్ బాధితులు త్వరగా కోలుకోవాలంటే ట్రీట్మెంట్తో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం అవసరం. దీంతో ప్రభుత్వం ఆస్పత్రులు, కేర్సెంటర్లు, ఐసీయూ సెంటర్లలో ఉన్న బాధితులకు భోజనాన్ని అందించింది. కాకినాడ రాజమండ్రి తోపాటు అమలాపురం తదితర ప్రాంతాలలో క్యాటరింగ్ ద్వారా మూడు పూటలా బాధితులకు ఆహారాన్ని అందించింది. జిల్లాలో తొలిదశ కొవిడ్ వేవ్లో అమలాపురం రిమ్స్, జెఎన్ టియుకె కాకినాడ జిజిహెచ్ ఆస్పత్రితో పాటు కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఐసొలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొవిడ్ బాధితులను అక్కడ ఉంచారు. అయితే భోజనం బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు.