తూర్పు గోదావరి: రాజోలు పరిధిలోని తాటిపాకమఠం గ్రామానికి చెందిన వాటాల శ్రీనివాసరావు (26) విద్యుదాఘాతానికి గురై శనివారం మృతి చెందాడు. వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటాల శ్రీనివాసరావుకు భార్య, ఒక పాప ఉన్నారు.