తూర్పు గోదావరి: మండపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా వున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును ఎట్టకేలకు భర్తీ చెసారు. గత టెక్నీషియన్ 2016లో బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి ఆసుపత్రి వైద్యులు తాత్కాలిక ఏర్పాట్లతో అరకొర సేవలు అందిస్తున్నారు. దీంతో సరైన వైద్య పరీక్షలు నిర్వహించేవారు లేక రోగులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యేవారు. అయితే బొమ్మోరు క్వారంటైన్ సెంటర్ నుంచి టెక్నీషియన్ శ్రీను ను శనివారం ఇక్కడ నియమించారు. టెక్నీషియన్ ను ఏర్పాటు చేసిన నాయకులకు, వైద్య సిబ్బందికి పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.