పి. గన్నవరం మండలంలోని ఎల్. గన్నవరం గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు శనివారం రాత్రి ప్రమాదవశాత్తూ పి. గన్నవరం ప్రధాన పంట కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చింతా రవిబాబు (31) అనే దివ్యాంగుడు ట్రై సైకిల్ పై శనివారం రాత్రి ఇంటి నుంచి ఏటిగట్టు సెంటర్కువెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి ట్రై సైకి తో సహా పంట కాలువలో పడి గల్లంతయ్యాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.