పాఠశాలలు, కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులకు హిజాబ్ ను ధరించే స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని రాష్ట్ర షియా ఉలేమా బోర్డు అధ్యక్షుడు, ప్రభుత్వ ఖాజీ మౌలానా సయ్యద్ అబ్బాస్ బాఖరీ పేర్కొన్నారు. నగరంలో మదర్సా విద్యార్థినులు శనివారం హిజాబ్ ధరించే హక్కును కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.