మత్స్యకార అభ్యున్నతి యాత్రకు విచ్చేయుచున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ది: 20: 02: 2022 ఉదయం 10 గంటలకు రాజమండ్రి(మధురపూడి) ఎయిర్ పోర్ట్ కి చేరుకుని అక్కడనుండి రావులపాలెం, మార్టేరు, పెనుగొండ, పాలకొల్లు మీదుగా నరసాపురం బహిరంగ సభకు చేరుకోనుచున్నారని రాజానగరం నియోజకవర్గం ఇన్ చార్జ్ మేడా గురుదత్తప్రసాద్ తెలిపారు. కావున రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఉదయం 10 గంటలకు ఎయిర్ పోర్ట్ వద్ద అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుటకు విచ్చేయవలసినదిగా రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ తెలిపారు.