తూర్పు గోదావరి: తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ పుదుచ్చేరి ప్రభుత్వానికి విన్నవించినట్టు యానాం ప్రాంత కాంట్రాక్టు టీచర్లు శనివారం విలేకరులకు తెలిపారు. 2014లో ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా ఎంపిక కమిటీ ద్వారా తాము ఆయా ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమను పర్మెనెంట్ చేయాలని సీఎం, విద్యామంత్రికి సైతం వినతిపత్రాలు పంపినట్టు వారు తెలిపారు. సమావేశంలో అనిత, దుర్గ, కుసుమ, భవాని, మొల్లేటి లక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.