ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 10:05 AM

తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలంలో ఇసుక అక్రమ తరలింపు ఆగడం లేదు. వేట్లపాలెం రోడ్డులో లారీలతో ఇష్టారీతిన అనుమతుల్లేకుండా తరలిస్తున్నారు. వేట్లపాలెం నుంచి అడవిపేటకు రూ. 80లక్షలతో ఇటీవల తారురోడ్డు వేశారు. లారీలు ఇసుక లోడుతో తిరగడంతో రోడ్డు త్వరగా పాడయ్యేలాఉంది. దీనిపై గత నెలలో రామస్వామితోట సమీపంలో గ్రామస్థులు లారీలను అడ్డుకున్నారు. అంతకుముందు సెబ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇసుక తరలింపు మాత్రం ఆగలేదు. లారీలపై యథేచ్ఛగా ఇసుకను మితి మీరిన వేగంతో తరలిస్తున్నారు. దీనిపై పలువురు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com