ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 19, 2022, 04:09 PM

విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ తమ హయాంలో దసరా, భవానీ దీక్షలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అన్నదాన వితరణ జరిపామని ప్రకటన చేశారు. భక్తులకు దర్శనం కల్పించామని, రెండేళ్ల కాలంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు. శివాలయం పున నిర్మాణం, లడ్డూ పోటు, అన్నదానం, ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టామని, దుర్గగుడిలో మహిళా క్షురకులను నియమించాలని తీర్మానించామని వెల్లడించారు. మహిళల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించామని, తిరుమల తరహాలో 20 మంది మహిళా క్షురకులకు నియమించే విధంగా తీర్మానం చేసి కమిషనర్ కు పంపామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com