ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు కోట్ల రూపాయలతో మహిళా వాలంటీర్ పరారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 19, 2022, 02:40 PM

విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీల వార్డు వాలంటరీ మహిళా సంఘాలకు సుమారు రెండు కోట్లకు టోకరా వేసినట్లు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. సాలూరు మునిసిపాలిటీ పరిధిలో ఉన్న. 29వార్డు 14వ సచివాలయానికి చెందిన మానాపురం రమ్యా కుమారి సుమారు రెండు కోట్ల రూపాయల తో పరారయిందని చిట్లువీధి, సారిక వీధి మహిళలు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రమ్యా కుమారి గత కొంతకాలంగా పట్టణంలో మహిళలనుంచి వేలాది రూపాయలు వసూలు చేసి నమ్మకంతో వడ్డీని చెల్లిస్తుండేది. అదే విధంగా చిట్టీలు కూడా నిర్వహిస్తుండేది. అధిక వఢ్డీపై ఆశతో వందలాది మంది మహిళలు ఆమెకు డబ్బు లు ముట్టజెప్పినట్లు తెలిసింది గురువారం సచివాలయానికి వచ్చిన తర్వాత ఆమె కనిపించడం లేదని మహిళలు పిర్యాదు చేశారు. రెండుకోట్లతో పరారయిందని తెలుసుకున్న మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఫిర్యాదు చేశారు. నమ్మకం గా వ్యవహరిస్తూ తమని నట్టేట ముంచిందని వాపోతున్నారు. దీనిపై టౌన్ ఎస్ఐ ఫక్రుధ్ధీన్ కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com