విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కెపాడు గ్రామ సమీపంలో నాటుసారా కేంద్రాలపై దాడులు చేసి 800 లీటర్ల బెల్లం ఊటలను కురుపాం ఎస్. యి. బి అధికారులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వ్యక్తులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నాటుసారా వల్ల వచ్చే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.