ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంకు చెందిన బాలుడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. ప్రస్తుతం అతడు కోరుకొండలోని పెదనాన్న వద్ద ఉంటున్నాడు. ఇటీవల తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో బాలుడికి, అతడి పిన్నికి మధ్య ఏర్పడిన చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో బాలుడితో చిన్నాన్నలు మందపల్లి అప్పన్న, మందపల్లి సతీష్ బాలుడిపై దాడి చేశారు. బాలుడి తొడలు, మర్మాంగాలపై వాతలుపెట్టారు. ఎవరికైన చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఐతే జరిగిన విషయాన్ని బాలుడు పెద్దమ్మకు చెప్పగా పెదనాన్న వెళ్లి వారిని నిలదీశాడు. అతడ్ని కూడా సతీష్, అప్పన్న తిట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.