కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక గ్రామంలో ఖాళీగా ఉన్న ఒక వలంటీరు పోస్టు(ఓసీ)కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో బీకేఎస్ఎస్ వెంకట్ మన్ తెలిపారు. అభ్యర్థి గ్రామానికి చెందిన వారై ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులై 18-35 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు.